నీట్ పరీక్షపై బీజేపీని విమర్శిస్తూ ఏఐసీసీ అధ్యక్షులు శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. NTA ద్వారా నీట్ కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. నీట్ పేపర్ లీక్ కాకపోతే బీహార్లో 13 మంది ఎందుకు అరెస్ట్ అయ్యారని ప్రశ్నించారు. ఇది మధ్యప్రదేశ్లో జరిగిన వ్యాపమ్ కుంభకోణానికి ఆధునిక వెర్షన్ అని పేర్కొన్నారు. నీట్ స్కామ్ను మోడీ కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు.