ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పాలనాధికారి వెంకటేశ్ దోత్రే సూచించారు. ఎండల తీవ్రతపై బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బకు గురైన వారు పాటించాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వడ దెబ్బ బాధితులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు.