విద్యుత్తు తీగలు అమర్చితే కఠిన చర్యలు తప్పవు: వాంకిడి ఎస్ఐ

555చూసినవారు
విద్యుత్తు తీగలు అమర్చితే కఠిన చర్యలు తప్పవు: వాంకిడి ఎస్ఐ
వ్యవసాయ పొలాల్లో పంటలకు రక్షణగా, అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చితే కఠిన చర్యలు తప్పవని వాంకిడి ఎస్ఐ సాగర్ హెచ్చరించారు. నార్నూర్ మండలానికి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ మృతిపై పోలీసు కార్యాలయంలో మంగళవారం సంతాపం తెలిపారు. వఎస్ఐ మాట్లాడుతూ. ఎవరైనా విద్యుత్ తీగలు అమర్చితే పోలీసులకు తెలుపాలని విజ్ఞప్తి చేశారు. గతంలో టొక్కిగూడలో ఒకరు విద్యుత్ తీగలు తగిలి బలయ్యారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్