ఆదివాసుల నిరసన
తిర్యాణి మండల కేంద్రంలో జైనూర్ ఆదివాసి మాస్కోల్ల లక్ష్మణ్ పై జరిగిన దాడికి శుక్రవారం నిరసనగా తిర్యాణి మండల ఆదివాసి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకుడు కుర్సేగ శోభన్ మాట్లాడుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఇక ముందు ఆదివాసులపై ఎలాంటి దాడులు జరిగిన ఆదివాసి నాయకునిగా ముందుండి పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బతిర్యాణి మండల అధ్యక్షులు తుడసం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.