May 04, 2024, 05:05 IST/సిర్పూర్
సిర్పూర్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్
May 04, 2024, 05:05 IST
బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో అదిలాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపే లక్ష్యంగా శనివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొని ఎన్నికల్లో ఆత్రం సక్కును గెలిపించి లోక్ సభకు పంపాలని కోరారు. అనంతరం ఆయన సమక్షంలో పలువురు నాయకులు బీఎస్పీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.