ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం పెనుబల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అన్నపురెడ్డిపల్లి మండలం బూర్గూడెం గ్రామానికి చెందిన మెకానిక్ షేక్ ఖాసీం బైక్ పై సత్తుపల్లికి వెళ్తుండగా అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అన్నపురెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.