విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి

560చూసినవారు
విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు చరణ్ డిమాండ్ చేశారు. చర్లలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్యను నేర్పించే విషయంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కావున ప్రస్తుత ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై శిక్షణ ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్