రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలోని ప్రభు నర్సరీ వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణాజిల్లా ఏ కొండూరు మండలం చీమలపాడు వాసులు చీపు బాలకృష్ణ అతని భార్య లక్ష్మి(30) పిల్లలు శరణ్య(8)శాన్విక (6)తో బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనాలు ఢీకొని లక్ష్మీ ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా బాలకృష్ణ అపస్మారక స్థితిలోకి వెళ్ళగా హుటాహుటిన అంబులెన్సు సహాయంతో ఖమ్మం తరలించారు.