పాత ప్లాంట్ కూల్చివేత పనులపై సమగ్ర విచారణ జరిపించాలి

570చూసినవారు
పాత ప్లాంట్ కూల్చివేత పనులపై సమగ్ర విచారణ జరిపించాలి
పాల్వంచ కేటీపీఎస్ లోని పాత ప్లాంట్ కూల్చివేత పనులపై సమగ్ర విచారణ జరిపించాలని, 100 కోట్లకు పైగా జరిగిన భారీ కుంభకోణంలో అధికారుల పాత్ర పై ఏసిబి విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పాల్వంచ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముంబై సంస్థ 100కోట్లకు పైగా భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్