భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ జిల్లా కార్యాలయంలో 12వ వార్డు కౌన్సిలర్ కూరపాటి విజయలక్ష్మి, 19వ వార్డు కౌన్సిలర్ బండి నరసింహా వారితోపాటు 100 కుటుంబాలు ఆదివారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఆధ్వర్యంలో సిపిఐ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి సిపిఐ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.