భద్రాచలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

80చూసినవారు
వరదలు నేపథ్యంలో భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జీతేష్ పాటిల్ మంగళవారం సూచించారు. ఆయన ఒక వీడియో రూపంలో గోదావరి వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీడియోలో తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్