2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన

67చూసినవారు
కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆంక్షలు లేకుండ రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కుటుంబం మొత్తం కలిపి రేషన్ కార్డ్ లో పేరు ఉన్న వాళ్లకు 2 లక్షల వరకు అనడం సరికాదు అన్నారు. అన్ని హామీలు అమలు చేసే వరకు బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్