పట్టభద్రుల ఓటర్ తుది జాబితాను విడుదల చేసిన జిల్లా కలెక్టర్

1553చూసినవారు
పట్టభద్రుల ఓటర్ తుది జాబితాను విడుదల చేసిన జిల్లా కలెక్టర్
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్- ఖమ్మం-నల్లగొండ శాసనమండలికి జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు తుది ఓటర్ జాబితాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల గురువారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 39897 ఓటు హక్కు నమోదు చేసుకున్నారని తెలిపారు. అందులో పురుషులు 22485, స్త్రీలు 17412 గా ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో 29 ప్రదేశాలలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్