పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రాత్రివేళలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురుని ఖమ్మం ఆర్బన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ ఏసీపీ హరికృష్ణ తెలిపారు. శుక్రవారం రాత్రి పోలీస్ పెట్రోలింగ్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు నగరంలోని ధంసాలపూరం బిడ్జీ కింద బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఐదుగురు కనపడడంతో వారి పై కేసులు నమోదు చేసినట్లు టౌన్ ఏసీపీ హరికృష్ణ తెలిపారు.