
రక్తపోటు దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని మే 17న నిర్వహిస్తారు. 2005లో ఈ దినోత్సవం తొలిసారిగా ప్రారంభమైంది. మొదట మే 14న జరిపేవారు. అయితే 2006 నుంచి శాశ్వతంగా మే 17న జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవ ఉద్దేశం అధిక రక్తపోటు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం. దీని నివారణ, నియంత్రణపై సమాజం మొత్తం శ్రద్ధ చూపేలా ప్రోత్సహించడమే ఈ దినోత్సవం లక్ష్యం.