కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా బనకల్ సమీపంలో హైవేపై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓమ్నీ వ్యాన్లో కొందరు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వారి వాహనాన్ని వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి పంపారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.