డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ 'మ్యాడ్' మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ నెల 15న మ.12.30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. ఇక ఈ సినిమాలో సంగీత్ శోభన్, నితిన్ నార్నే, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉదయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా, అక్టోబర్ 6న చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగొట్టి సూపర్ హిట్గా నిలిచింది.