వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలి: ప్రేమ్ కుమార్

78చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాలను ఆదివారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బల్బుల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వరుణ్, కళ్యాణ్, ప్రవీణ్, చరణ్, వసతి గృహాల విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్