ప్రమాదకరమైన మొక్కలను తొలగించాలని మున్సిపాలిటీ అధికారికి వినతి పత్రం

82చూసినవారు
ప్రమాదకరమైన మొక్కలను తొలగించాలని మున్సిపాలిటీ అధికారికి వినతి పత్రం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కమిషనర్ ని కలిసి కోనో కార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలి అని భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. మున్సిపాలిటీ కేంద్రంలోని కోనో కార్పస్ మొక్కల వల్ల ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అనేక రకాల ఎలర్జీల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రదీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్