విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ నిరంతర పోరాటం

76చూసినవారు
విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ నిరంతర పోరాటం
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితుడు సంబాగ్ ప్రముఖ్ బీజాపూర్ కరేందర్నాథ్ మాట్లాడుతూ 1949 జూలై 9న ఏబీవీపీని ప్రారంభించామన్నారు. విద్యార్థుల సమస్యల కోసం కృషి చేసిందన్నారు. నిరంతరం విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. దేశ రక్షణ కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్