మల్దకల్ మండలంలోని శ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎవ్వరైనా కానీ బండలాగుడు పోటీలు నిర్వహించడం చట్టరీత్య నేరమని ఏఎస్పీ రవి గురువారం తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎవ్వరైన బండలాగుడు పోటీలు నిర్వహిస్తే, నిర్వాహకులపైన, ఎద్దుల యజమానుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ ఎద్దులను కూడా షీజ్ చేస్తామని అన్నారు. నిర్వాహకులకు బండలాగుడు పోటీలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వలేదని అన్నారు.