శివ భక్తులకు మజ్జిగ పంపిణీ

1543చూసినవారు
శివ భక్తులకు మజ్జిగ పంపిణీ
కర్ణాటక నుంచి శ్రీశైలానికి వెళ్లే శివ భక్తులకు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మాజీ వార్డు సభ్యుడు వెంకటేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. కర్ణాటకలోని బీజాపూర్ నుంచి శ్రీశైలానికి భక్తులు పాదయాత్ర చేపట్టారు. వేసవికాలం ఎండ తాపానికి అలమటిస్తున్న శివ భక్తులు మజ్జిగ తాగి ఉపశమనం చెందారు. సోమవారం వెంకటేష్ కుటుంబ సభ్యులు శివ భక్తులకు మజ్జిగ అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్