జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పుణ్యక్షేత్రంలో సోమవారం అమావాస్య సందర్భంగా మహబూబ్ నగర్ డిఎస్పి వెంకటేశ్వర్లు ఆదిదంపతులైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి స్వామివారి ఉత్సవ విగ్రహాలకు మంగళద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఇలాంటి అభిషేకాలు చాలా అరుదుగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.