జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం చింతలకుంట బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ మునిస్వామి శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత తిరుపతయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో 20 మంది గ్రామ ప్రముఖులు పార్టీలో చేరారు. లోక్ సభ ఎన్నికలలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి గెలుపుకు కృషి చేస్తామని చెప్పారు.