జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవహేళన చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు ఎస్ఏ సంపత్ కుమార్ నడిపించారు.