గద్వాల రాచకొండ కమిషనర్ తరుణ్ జ్యోషి చేతుల మీదుగా రివార్డ్ అందుకున్న షాద్ నగర్ ఏసిపి రంగస్వామి శనివారం రివార్డును అందుకున్నారు. నార్ల గాలయ్య తన భార్యను కట్నం విషయంలో వేధించి ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటనలో అలివేలు 2016 ఆగస్టు 24న దుర్మరణం పాలయింది. ఈ సంఘటన సమయంలో విచారణ అధికారిగా వ్యవహరించిన అప్పటి అధికారి రంగస్వామి సాక్షాధారాలను పకడ్బందీగా సేకరించి నిందితుడికి తగు శిక్ష పడేలా వ్యవహరించారు.