గద్వాల పట్టణం లింగం బాగ్ కాలనీకి చెందిన రాజేష్ ఇంటి తాళం పగలగొట్టి నగదు, బంగారం ఎత్తుకెళ్లిన దుండగులను అరెస్టు చేసి వారి నుండి కొంత నగదు, బంగారం రికవరీ చేసినట్లు అడిషనల్ ఎస్పీ గుణశేఖర్ సోమవారం తెలిపారు. రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి దొంగతనానికి పాల్పడిన నంద్యాల జిల్లాకు చెందిన శ్రీకాంత్, షేక్ మొహమ్మద్ లను అరెస్ట్ చేసి జైలుకు పంపామని తెలిపారు.