మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం అరకు పర్యటన కోసం కుటుంబసభ్యులతో కలిసి వెళ్ళాడు. పర్యటనలో సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం దౌల్తాబాద్ కు తీసుకువస్తున్నారు. బుధవారం అంతక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.