వైభవంగా జానకి రాముల ఎదురుకోళ్లు

68చూసినవారు
శ్రీరామనవమి వేడుకలలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీ సీతారామచంద్రుల ఎదురుకోళ్ల గట్టం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో సీతామాతను స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం నుండి పల్లకిలో తీసుకుని వచ్చి, శ్రీరాముల చెంతకు చేర్చిన ఇరువురు తరపు పెద్దలు కళ్యాణ పత్రికను మార్చుకొన్నారు. అనంతరం మహా మంగళహారతితో ఎదురుకోళ్లు ఘట్టాన్ని పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్