బైక్ ఢీకొని చిన్నారులకు గాయాలు ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే

5358చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో స్కూల్ కి వెళ్తున్న విద్యార్థులను సోమవారం ద్విచక్ర వాహనం ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. అటు వైపు నుంచి వెళ్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆ సంఘటనను చూసి వెంటనే తన వాహనాన్ని నిలిపి చిన్నారుల దగ్గరికి వెళ్లి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంలో స్పందించిన ఎమ్మెల్యే పనితీరును స్థానికులు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్