పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా మాట్లాడారా.? అంటూ మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. షాద్ నగర్ లో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని డీకే ఆరుణ అన్నారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పోరాటం చేశారా అని నిలదీశారు.