బాలానగర్ లో అపరిశుభ్రంగా పరిసరాలు

55చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో గత కొన్ని రోజులుగా చెత్త తొలగించకపోవడంతో పేరుకుపోయింది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో చెత్తని తొలగించకపోవడంతో కంపు కొడుతుందని బాటసారులు, వాహనదారులు అన్నారు. పేరుకుపోయిన చెత్త దగ్గర కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అధికారుల స్పందించి చెత్తని తొలగించాలని మంగళవారం మండల కేంద్ర ప్రజలు, బాటసారులు కోరారు.

సంబంధిత పోస్ట్