బావిలో మునిగి యువకుడు మృతి

3303చూసినవారు
బావిలో మునిగి యువకుడు మృతి
బావిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కల్వకుర్తి నియోజకవర్గంలో శుక్రవారం చోటుచేసుకుంది. మాడుగుల మండలం కేంద్రానికి చెందిన కుమార్ (33) గురువారం ఈత కొట్టేందుకు వెళ్లి బావిలో మునిగిపోయాడు. బయటికి రాకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం బయటికి తీశారు. కుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి ఏడేళ్ల క్రితం వెల్దండ మండలం గుండాల గ్రామానికి చెందిన యువతితో పెళ్లయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్