గంజాయి తాగొద్దన్నందుకు తండ్రిపై కుమారుడు పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన తుర్కయంజాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులకు వివరాల ప్రకారం. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన రవీందర్ (60)కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనురాగ్ గంజాయికి బానిసయ్యాడు. గంజాయి తాగొద్దని మందలించడంతో, పెట్రోల్ పోసి, బండరాయితో మోది తండ్రిని హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.