కొల్లాపూర్ నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుదల, ఆర్డబ్ల్యుస్ అధికారులకు సూచించారు. బుధవారం వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె జలాశయాన్ని మంత్రి సందర్శించారు. సురక్షితమైన నీటిని ప్రజలకు అందించేందుకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.