అర్బన్ ఎకో పార్క్ సందర్శించిన విద్యార్థులు

60చూసినవారు
విజ్ఞాన విహారయాత్రలో భాగంగా బుధవారం ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల విద్యార్థులు మహబూబ్ నగర్ లోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ను సందర్శించారు. అంతకు ముందు వారు పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం చారిత్రక పిల్లల మర్రిని చూశారు. పీఎంశ్రీ పథకంలో భాగంగా ప్రిన్సిపాల్ ఎం. రాజారాం ఆధ్వర్యంలో ఈ విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేశారు. విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్