సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్దింటి రాజుతో పాటు ఇతర నాయకులు శనివారం మక్తల్ లో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.