నామినేషన్ల చివరి రోజు అయిన గురువారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు తన నామినేషన్ పత్రాన్ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, ఎంపీ పోతుగంటి రాములు, జిల్లా బిజెపి అధ్యక్షులు ఎళ్లేని సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.