నాగర్ కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న భాషా పండితులు, పీఈటీల పదోన్నతులకై సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారంతో పూర్తయిందని నాగర్ కర్నూల్ డీఈవో ఎం. గోవిందరాజులు తెలిపారు. మంగళవారం నాగర్ కర్నూల్ డీఈవో కార్యాలయంలో పీఈటీలు, పండితుల విద్యా అర్హతల ధ్రువపత్రాల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఉపాధ్యాయులు పదోన్నతికై తమ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసుకున్నట్లు డిఇఓ తెలిపారు.