కాలం చెల్లిన మద్యం పారబోత

576చూసినవారు
కాలం చెల్లిన మద్యం పారబోత
తిమ్మాజిపేటలోని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం గోదాంలోని కాలం చెల్లిన మద్యాన్ని శనివారం పారబోశారు. నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ కల్యాణ్ ఆధ్వర్యంలో మూడు బ్రాండ్లకు సంబంధించిన 579 కార్టన్లు దాదాపు రూ.50 లక్షల విలువ చేసే మద్యం సీసాలను
ధ్వంసం చేశారు. చాలా కాలంగా నిల్వ ఉండటం, ఈ బ్రాండ్లు కొనుగోలు చేసేవారు లేకపోవడంతో ఈ చర్య చేపట్టినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్