వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం..!

80చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్ఠ గావించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుంత మౌనిక, కౌన్సిలర్ సంధ్య రవీందర్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి కృష్ణ గౌడ్, పరిసరప్రాంత భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్