రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం అందించాలి: సిపిఐ గోపాల్

51చూసినవారు
రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం అందించాలి: సిపిఐ గోపాల్
వనపర్తి జిల్లా రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సాయం ఎకరానికి రూ. 7500 వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని సోమవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వంకా గోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. జూన్ నుంచి ఖరీఫ్ సాగు మొదలైందని దుక్కులు, విత్తనాలు, ఎరువులకు డబ్బులు అవసరమన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ. 15000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఖరీఫ్ కు ఎకరాకు రూ. 7500 విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్