కురుమూర్తి సాక్షిగా.. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తాం: రేవంత్

73చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోటలో సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కొత్తకోట గడ్డమీద నుండి కురుమూర్తి స్వామి సాక్షిగా మాట ఇస్తున్నా. ఆగస్టు 15లోగా రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తానని ప్రజలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్