వనపర్తి జిల్లా నిన్న నల్లచెరువులో స్నానానికి వెళ్లి గల్లంతయిన ఉందెకోటి కృష్ణయ్య (45) ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పోలీసులను ఆదేశించారు. బుధవారం సంఘటన స్థలాన్ని సందర్శించి పోలీసులతో పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మాట్లాడుతూ. వేసవికాలంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తల్లిదండ్రులు ఈతకు వెళ్లే పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.