మాత శిశు హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
మాత శిశు హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
మంచిర్యాల నడిబొడ్డున సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మించడం వల్ల నా జన్మ ధన్యమైందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గురువారం ఐబీ స్థలంలో మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణంకు శంఖుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ భవనాన్ని కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం అనాలోచితంగా మాతా, శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున నిర్మించి మార్కెట్ ను నడిబొడ్డులో నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్