కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని శ్రీ కాళభైరవ స్వామి ఆలయాన్ని శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నియోజవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.