మేకల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్

59చూసినవారు
మేకల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్
మేకల దొంగతనం కేసులో ముగ్గురిని రిమాండ్ కు తరలించినట్లు జైపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు. జైపూర్ మండలంలోని గంగిపల్లిలో ఈనెల 6న సత్యనారాయణ రెడ్డికి చెందిన ఎనిమిది మేకలను శ్రీరాంపూర్ కు చెందిన శ్రీనివాస్ గౌడ్, సారయ్య, మల్లేష్ దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుల నుంచి ఎనిమిది మేకలతో పాటు కారు, బైకును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్