రక్తదానం చేసిన ఆటో కార్మికులు

66చూసినవారు
రక్తదానం చేసిన ఆటో కార్మికులు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో నస్పూర్ ఎస్సై నెల్కి సుగుణాకర్ ఆధ్వర్యంలో 26 మంది ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారిని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసిపి ప్రకాష్, సీఐ ప్రమోద్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు చెల్ల విక్రమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్