మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

55చూసినవారు
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, కార్మికుల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేసి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్