రాముని చెరువును కబ్జాల నుండి కాపాడాలి

569చూసినవారు
రాముని చెరువును కబ్జాల నుండి కాపాడాలి
మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు భూమిని ఆక్రమణదారుల నుండి కాపాడాలని పౌర సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం వారు నీటిపారుదల శాఖ ఈఈ ఎం. రాముకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో చెరువు మధ్యలో నిర్మించిన కట్ట వల్ల భూమి ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. 2019లో అప్పటి జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆధ్వర్యంలో వేసిన సరిహద్దు రాళ్ళను కొందరు తొలగించి ఆక్రమణలకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్